కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత, కార్పొరేటర్ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆదివారం కరీంనగర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీలత మాట్లాడుతూ... ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమను చిన్నచూపు చూడటం, అభివృద్దికి నిధులు కేటాయించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక ఓ భూమి వివాదంలో తన భర్త చంద్రశేఖర్ను ఎమ్మెల్యే కమలాకర్ పోలీసు కేసుల్లో ఇరికించారని ఆమె ఆరోపించింది. ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోతే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీలత పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm