మధ్యప్రదేశ్: బీజేపీ సీనియర్ నేత యశోధర రాజే సింధియా మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హస్తానికి ఓటేస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కవంటూ ఓటర్లను ఓ రకంగా హెచ్చరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేత రామ్ సింగ్ యాదవ్ మరణంతో రాష్టంలోని శివపురి జిల్లాలో ఉన్న కొలారస్ నియోజకవర్గానికి వచ్చేవారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లో క్రీడల, యువ సంక్షేమ శాఖ మంత్రిగా యశోధర పనిచేస్తున్నారు. ఓ వీడియో క్లిప్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని బీజేపీ ఆవిష్కరించిందని, ఓటర్లు కమలం గుర్తును కాదని హస్తం గుర్తుకు ఓటేస్తే, ఈ స్కీమ్ ఫలాలు దక్కవని ఆమె
వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె ఓటర్లను భయపెట్టారంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు మంత్రి యశోధరా రాజేపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల కోడును ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 03:29PM