జోహాన్నెస్బర్గ్: సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యచ్లో భారత అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్ల కన్నా ముందే ఆలౌటైంది. తొలి రెండు మ్యాచ్ల్లో కొనసాగిన బ్యాట్స్ఉమెన్ల జోరు న్యూ వాండరర్స్ మైదానంలో మాత్రం కనిపించలేదు. స్టార్ బ్యాట్స్ఉమన్ స్మృతి మంధాన(37), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(48) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో కేవలం 17.5 ఓవర్లలో 133 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్ ముగించింది. ఆరంభంలోనే ఓపెనర్ మిథాలీ రాజ్ డకౌట్గా వెనుదిరగడం భారత్పై ఒత్తిడి పెరిగింది. మిడిలార్డర్లో కీలకమైన వేద కృష్ణమూర్తి(23) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి స్వల్ప వ్యవధిలోనే వికెట్ చేజార్చుకుంది. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బతీసింది.
Mon Jan 19, 2015 06:51 pm