హైదరాబాద్: నగరంలో కొంపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. తన లవర్ దక్షిష్ పటేల్తో వీడియో కాల్ మాట్లాడుతూ లైవ్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని తుదిశ్వాస విడిచింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తెగా పోలీసులు గుర్తించారు.
గదిలో ఎవరూ లేని సమయంలో గడియపెట్టి ఈ దారుణానికి పాల్పడింది. తలుపులు బద్దలుకొట్టి హనీషాను సిగ్మా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆమె ఫోన్లో ఉన్న కాల్డేటా ఆధారంగా పోలీసులు..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 05:21PM