యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రక్షణగోడ నిర్మాణంతో పాటు గర్భాలయం పైకప్పు పనులు జోరందుకున్నాయి. గతేడాది నవంబరు 24న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో పరిస్థితులో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయగా..విస్తరణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. గర్భాయల పైకప్పు నిర్మాణ దశకు చేరుకోగా.. రక్షణగోడ నిర్మాణ పనులు దక్షిణదిశలో చివరిదశకు వచ్చాయి. దీంతో ఆలయ విస్తరణ పనుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన దక్షిణ రాజగోపురం నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. గర్భాలయం పైన నిర్మితమయ్యే కీలకమైన గోపుర నిర్మాణానికి ఫిబ్రవరి 5వ తేదీను ముహుర్తంగా నిర్ణయించినట్లు యాడా వైస్ ఛైర్మన్ జి.కిషన్రావు తెలిపారు. యాడా విధించుకున్న గడువు జులైలోపు పనులు పూర్తికావాలంటే మరింత వేగం పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm