హైదరాబాద్: ఎర్రజొన్నల కొనుగోలు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. క్వింటాలుకు రూ. 2,300 ధరకు మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి ఎర్ర జొన్నల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలి దశగా నిజామాబాద్, ఆర్మూరు, వేల్పూరు, కమ్మరపల్లి, బాల్కొండ వ్యవసాయమార్కెట్లలో ఎర్రజొన్నల సేకరణ నిర్వ హించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు టోకెన్లు జారీచేస్తున్నారు. వీటిపైఉన్న తేదీ ఆధారం గా రైతులు కేంద్రాలకు ఎర్రజొన్నలను తీసుకురావాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm