న్యూడిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో తన విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు ట్రంప్ టవర్స్కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా భారత్లో విదేశాంగ విధానంపై కూడా ప్రసంగించనున్నారు. కోల్కతా, ముంబయి, పుణె, గురుగ్రామ్ నగరాల్లో భారత పెట్టుబడిదారులు, బిజినెస్ లీడర్లతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొంటారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. జూనియర్ ట్రంప్ భారత్లో అడుగుపెట్టకముందే ప్రముఖ వార్తాపత్రికల్లో ఆయన రాక గురించి ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ప్రచారం కూడా చేశాయి. వచ్చే శుక్రవారం ఇండో-పసిఫిక్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో భారత్లో ఆయన తొలిసారి ప్రసంగించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm