హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో రేపు మరో కొత్త పార్టీ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. తాను రేపు పార్టీ ప్రారంభించి, తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతానని సినీనటుడు కమలహాసన్ ప్రకటన చేశారు. కాగా, ఈ నేపథ్యంలో కమల్ రేపు సాయంత్రం మధురైలో ఇస్తున్న విందులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్ సన్నిహితులు తెలిపారు.
గతేడాది సెప్టెంబరులో కమలహాసన్ను కేజ్రీవాల్ కలిసి, కాసేపు ముచ్చటించి వెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో అధికమవుతోన్న మతతత్వానికి చరమ గీతం పాడాలని ఈ ఇద్దరు నేతలు యోచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 20,2018 05:02PM