హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీ కోసం కోటి రూపాయల నిధులు అందించారు. దీనిపై తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ... చిరంజీవికి రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన చిరంజీవి.. మెడికల్ కాలేజ్ కొత్త భవనం నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి రూపాయలను ఇచ్చారు. ఇదే విషయమై చిరంజీవి స్వగృహంలో కలిసిన మురళీ మోహన్.. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు చెప్పారు. రాజకీయాలను పక్కన పెడితే.. చిరుతో మురళీ మోహన్కు చిరకాల అనుబంధం ఉంది. 'మనవూరి పాండవులు', 'గ్యాంగ్ లీడర్' వంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm