ముంబయి: భారత దేశానికి ప్రధాని మోడీ నుంచి విముక్తి (మోడీ ముక్త్ భారత్) కల్పించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఇచ్చిన పిలుపు ముంబైని షేక్ చేస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలు గుజరాతీలపై దాడులకు పాల్పడుతున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఉన్న దాబాలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ముంబై శివార్లలోని వసాయ్ లో గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేశారు. షాపుల సైన్ బోర్డును ధ్వంసం చేశారు. గుజరాతీల ఆస్తులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలో కూడా ముంబై, దాదర్ లలో దాడులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ముంబైలోని గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm