న్యూఢిల్లీ: ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన అప్పీల్ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి హేమ్రాజ్ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ రంజన్ గోగయ్ నేతృత్వంలోని బెంచ్.. తల్వార్ దంపతులకు నోటీసులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm