హైదరాబాద్: కొత్త భూరికార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. సాగుకు పెట్టుబడి మద్దతు పథకంపై సచివాలయంలో సీఎస్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయ, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు. ఆధునీకరించిన భూముల వివరాలు, రైతుల బ్యాంకు ఖాతా వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని అధికారులను సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఈ నెల 28లోపు రైతుల వివరాలను వ్యవసాయ శాఖకు ఇవ్వాలని ఆదేశించారు. భూములు, సర్వే నంబర్లు, రైతులు, ఖాతాల వివరాలు తహసీల్దార్లతో ధృవీకరించి ఇవ్వాలని సీఎస్ సూచించారు. కొత్త భూరికార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలని, వివరాలు అందగానే వ్యవసాయ శాఖ చెక్కుల ముద్రణకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. బ్యాంకుల ద్వారా గ్రామాల వారీగా చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి చెక్కులు మండలాలు, గ్రామాల వారీగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి చెక్కుల పంపిణీని ప్రారంభిస్తారని, చెక్కుల పంపిణీ ప్రారంభానికి యంత్రాంగం సిద్ధం కావాలని నిర్దేశించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా అందే ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm