కొలంబో: నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ టీ-20లో చెలరేగి ఆడిన టీం ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత్ ఓడిపోతుంది అనుకున్న తరుణంలో బ్యాటింగ్కు దిగిన దినేశ్ మైదానంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దినేశ్ కార్తీక్ తన విజయానందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి విషయాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. చాలా సంతోషంగా ఉంది' అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 'నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్న. ముఖ్యంగా చివరి ఓవర్ ఆఖరి బంతిని నేను ఎప్పటికీ మర్చిపోను' అని కార్తీక్ పేర్కొన్నాడు. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కార్తీక్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 29 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. దాన్ని సిక్సర్కు తరలించి మ్యాచ్ గెలిపించాడు.
Mon Jan 19, 2015 06:51 pm