హైదరాబాద్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీల మీద ఉన్న భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు స్వచ్ఛ టిప్పర్లను ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. హైదరాబాద్, వరంగల్లో వ్యర్థ పదార్థాల ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm