విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైంధవుడిగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోదీకి కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. విభజన హామీల అమలుకు వెంకయ్య నాయుడు కృషి చేయాలని కోరారు. ఈనెల 27న అంబేద్కర్ విగ్రహాల ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తామని ప్రకటించారు. దాంతోపాటు.. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అందరూ గంటపాటు లైట్లు ఆఫ్ చేసి.. చీకటి దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm