న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు సుభాషిష్ చక్రవర్తి, అభిర్ రంజన్ బిస్వాస్ గెలుపొందారు. ఐదు స్థానాలకు గాను టీఎంసీ నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. మిగతా రెండు స్థానాల్లోనూ గెలుపునకు అవసరమైన సంఖ్యాబలం టీఎంసీకి ఉంది. ఐదో అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి టీఎంసీ మద్దతివ్వగా ఆయన గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm