అమరావతి: అసెంబ్లీ ప్రాంగణంలో నూతన సచివాలయ ఆకృతులను ప్రదర్శిస్తున్నారు. సచివాలయ తుది ఆకృతులను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధుల ప్రజంటేషన్ ఇస్తున్నారు. పాలవాగుకు రెండు వైపులా సచివాలయ భవంతులు ఉన్నాయి. 5 టవర్లుగా నిర్మించనున్న సచివాలయంలో ఒక్కో టవర్ 40 అంతస్థులు ఉండనున్నాయి. అన్ని టవర్లను కలుపుతూ 600 మీటర్ల మేర అంతర్గత మార్గం ఉండేటట్లు రూపొందించారు. సీఎంవో, సాధారణ పరిపాలన శాఖ ఒకే టవర్లో ఉండేలా డిజైన్ చేశారు. 46 అంతస్తులుగా సీఎం టవర్ , సీఎం టవర్కు చెంతనే సీఎస్ టవర్ ఉన్నాయి. సీఎం టవర్పై హెలిప్యాడ్ ఉండేటట్లు డిజైన్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm