శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా డోరులో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఎన్కౌంటర్లో రెండు మృతదేహాలతో పాటు రెండు ఏకె47 పిస్తోల్స్, ఇతర మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో షిష్టార్గం గ్రామాన్ని భద్రతా దళాల అధికారులు చుట్టుముట్టారని తెలిపారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm