బెంగళూరు: ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్పేకు పేరెంట్ సంస్థ ఫ్లిప్కార్ట్ నుంచి భారీగా నిధులు లభించాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఫోన్ పేకు రూ. 518 కోట్ల నిధులను అందించింది. డిజిటల్ పేమెంట్స్కు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ ఈ చర్య తీసుకుంది. తద్వారా దేశంలో టాప్ కంపెనీగా ఎదగాలని పథకాలు రచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులు గూగుల్ తేజ్, పేటీఎం, అమెజాన్ పే లాంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm