రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో రేపు శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. ఉదయం 9.26 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి వారి కల్యాణం జరగనుంది. శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ చైర్మన్ అతిథిగృహం ఎదుట కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. మూడు లక్షల వరకు భక్తులు హాజరు అవుతారని అధికారుల అంచనా వేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ పంపిణీ ఏర్పాట్లను పూర్తి చేశారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా 8 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. శ్రీసీతారామ కల్యాణంతో పాటే శివసార్వతుల కల్యాణం కూడా ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. అనంతరం వేములవాడలో సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ఉంటుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm