న్యూఢిల్లీ: బీసీసీఐపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ పిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ జరిపిన దర్యాప్తు తీరును తప్పుబట్టారు. బీసీసీఐ దర్యాప్తు బృందం షమీ క్యారెక్టర్ను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. అతడి వ్యక్తిగత విషయాలను బీసీసీఐ పక్కనపెట్టేసిందని విమర్శించారు. 'అతడు మళ్లీ ఆడతాడు సరే, అతడి క్యారెక్టర్ మాటేమిటి? షమీ గుణాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి వ్యక్తిగత జీవితం గురించి బీసీసీఐ ఏమాత్రం పట్టించుకోలేదు' అని హసీన్ పేర్కొన్నారు. హసీన్ జహాన్ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు షమీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడలేదని తేల్చి చెప్పారు. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్ను పునరుద్ధరించింది. అలాగే ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm