బ్లూమ్బర్గ్: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోని 500 మంది వ్యక్తులకు చెందిన 28 లక్షల కోట్ల విలువైన సంపద ఆవిరైపోయింది. ఇందులో ఒక్క ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ కు చెందిన షేర్ల వాటాలోనే ఏకంగా రూ.6.6 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. ఇదంతా కేవలం రెండు నెలల్లోనే జరిగిన పరిణామం. గత వారం రోజుల్లో అయితే టాప్ -500 బిలియనీర్ల సంపద రూ.11 లక్షల కోట్లు హాంఫట్ అయ్యింది. ముఖ్యంగా ఎస్ అండ్ పీ సూచీ, డోవ్ జోన్స్ , ఇండస్ట్రీయల్ యావరేజి రెండేండ్ల కనిష్టానికి పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ప్రారంభమైంది.ఇక అత్యధికంగా మార్కెట్ నష్టాలను మూటగట్టుకున్నది ఫేస్ బుక్ అనే చెప్పవచ్చు. టాప్ - 500 బిలియనీర్లు సంపద ఆవిరి సింహభాగం మార్క్ జుకర్ బర్గ్ దే. ఆయన సంపద రూ.6.6 లక్షల కోట్లు నష్టపోయారు. అలాగే టాప్ - 500 బిలియనీర్ల లిస్టులో జుకర్ బర్గ్ మూడు స్థానాలు పతనమై 7 స్థానానికి పడిపోయారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ అనలిటికా మూలంగా డేటా చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్ సంస్థ షేర్లు ఇప్పటి వరకూ 14 శాతం నష్టపోయాయి. ఇక ఒరాకిల్ కార్పోరేషన్ అధినేత లారీ ఎల్లిసన్ షేర్ల వాటాలో ఆవిరైన సంపద మొత్తం రూ. 45 వేల కోట్ల పైమాటే. అలాగే బెర్క్ షైర్ అధినేత వారెన్ బఫెట్, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ , గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ లు సైతం ఉమ్మడిగా రూ.11 లక్షల కోట్లు నష్టపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2018 07:46PM