భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదవశాత్తు మొక్కజొన్న యంత్రంలో పడి పార్వతి(30)అనే మహిళ మృతిచెందింది. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందు మండలం కొమరారం పంచాయతీ లక్ష్మినారాయణతాండలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం మద్యం మత్తులో భర్త ఆత్మ హత్య చేసుకోగా నేడు ప్రమాదవశాత్తు భార్య మృతిచెందింది. తల్లిదండ్రుల మృతితో పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు.
Mon Jan 19, 2015 06:51 pm