భోపాల్: బుల్డోజర్ల కింద కంకర రాళ్లకు బదులు మీరుంటారని అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను ఉద్దేశిస్తూ కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఎవరైనా నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ మధ్యప్రదేశ్లోని బేతుల్లో జరిగిన కార్యాక్రమంలో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులు ఏర్పాటు చేసిన సభకు హాజరై ఆయన ప్రసంగించారు. దేశంలో నిధులకు కొరత లేదని..అయితే, నిర్మాణ పనుల్లో అవినీతిని ప్రభుత్వం సహించదని గడ్కరీ అన్నారు. రోడ్లు వేయడానికి ఖర్చు చేస్తున్న సొమ్మంతా దేశంలోని పేద ప్రజలదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm