గునా: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గునాలో ట్రక్కు-బస్సు పరస్పరం ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm