తిరువనంతపురం: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని ఇప్పటికే కేరళకు వెళ్లాలని ఆదేశించినట్టు చెప్పారు. నిఫా వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. అదేవిధంగా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేరళ ఆర్యోగ శాఖతో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ను అరికట్టేందుకు ఔషధాలు కూడా లేకపోవడంతో.. ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ వైరస్ సోకడం కారణంగా కోజికోడ్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలి.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందిని వైద్యాధికారులు అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా విష జ్వరాలపై కలెక్టర్ జోస్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm