లక్నో : మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు అలీఘర్లోని ఓ కళాశాల పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు ఎగ్జామ్ టైమ్లో టాయిలెట్కు అని వెళ్లి.. మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నట్టు తేలింది. దీంతో ధరమ్ సమాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమ్ ప్రకాశ్ ఓ నిర్ణయానికి వచ్చారు. టాయిలెట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల మాస్ కాపీయింగ్ను అరికట్టొచ్చు అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు టాయిలెట్కు వెళ్లి.. అక్కడ చిట్టిలను వారి బట్టల్లో దాచుకుని వస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత పరీక్ష హాల్లో చూచిరాతకు పాల్పడుతున్నారని చెప్పారు. టాయిలెట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో.. ఏ విద్యార్థి చిట్టీలు కొడుతున్నారు.. అనే విషయాన్ని గ్రహించవచ్చు అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ చర్య వక్తిగత గోప్యతపై దాడి కాదని, నిరసన తెలపాల్సిన పనిలేదని అన్నారు.