న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించిన పురోగతి నివేదికను సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సోమవారం కోర్టుకు సమర్పించింది. దీనిపై ఈ నెల 30న కోర్టు విచారణ చేపట్టనుంది. ఉన్నావ్ యువతి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు సీబీఐ నిర్దారించిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ నిందితుల పట్ల యూపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో..యూపీ ప్రభుత్వం కేసును సీబీఐ అప్పగించింది. దీంతో సీబీఐ ఏప్రిల్ 13న సెంగర్తోపాటు శశిసింగ్, ఇతర నిందితులను అరెస్ట్ చేసి పలు ధపాలుగా విచారించి నిర్దారణకు వచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm