హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంపు విషయంలో ప్రభుత్వం వైఖరిని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. వేతనాలు పెంచమంటే సీఎం బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశమైంది. కార్మికులకు జీతాలు పెంపు, కార్మికుల సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజిరెడ్డి.. ఆర్టీసీని వదిలించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల హక్కులు సాధించుకున్నామని అన్నారు. మేధావులు, పొలిటికల్ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ వైఖరిపై వారి మద్దతు కూడగడతామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm