యాదాద్రి భువనగిరి: ఎంత పెద్ద సీనియర్లైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఏబీఎన్తో ఆయన మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు అంటే తమకు గౌరవం ఉందన్నారు. ఏదైనా సరే అంతర్గత విషయాన్ని రభస చేయడం సరైంది కాదని హితవు పలికారు. తాను స్వయంగా పిలిచే కార్యక్రమాలు ఏమీ ఉండవన్నారు. తెలుగుదేశం పార్టీ అతిపెద్ద కుటుంబమని పేర్కొన్నారు. ఇందులో అందరికీ బాధ్యత, భాగస్వామ్యం ఉంటుందని చెప్పుకొచ్చారు. జాతీయ నాయకత్వం నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తామని రమణ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm