ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లో నష్టాల బాటా పట్టాయి. ఉదయం నుంచీ నీరసంగా కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ నుంచీ కరెక్షన్ బాట పట్టాయి. చివరివరకూ అమ్మకాలు కొనసాగడంతో రోజులో కనిష్ట స్థాయిలవద్దే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 232 పాయింట్లు క్షీణించి 34,616 వద్ద స్ధిరపడింది. ఎన్ఎస్ఈ నిప్టీ 80 పాయింట్లు కోల్పోయిన 10,516 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఆటో, మెటల్ 3.3-1.7 శాతం మధ్య పతనమయ్యాయి. పీఎస్యూ బ్యాంక్స్ మాత్రం 2.7 శాతం జంప్చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm