న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. నకిలీ మద్యం సేవించి 11 మంది మృతి చెందడంతో ఈ నోటీలసులు పంపింది. యూపీలోని కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్ జిల్లాలోని లైసెన్సులు కలిగిన మద్యం షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీని కారణంగా అక్కడ ఇప్పటికే పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో దీనిపై సీరియస్గా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm