ఈ రోజు ఢిల్లీలో జేడీఎస్ నేత కుమారస్వామితో చర్చలు జరిపానని, కర్ణాటకలో రాజకీయ అంశాలతో పాటు పలు విషయాలపై చర్చించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన ట్వీట్ చేస్తూ... తాను ఈ బుధవారం కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నానని ప్రకటించారు. కాగా, ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరు కానున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కుమారస్వామి ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 08:38PM