హైదరాబాద్ : శునకాలకు విషం ఇచ్చి చంపుతున్నారని...వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 19వ తేదీన మెహిదీజంగ్ కాలనీలో ఓ వీధిలో శునకం చనిపోయి ఉంది. అంతకు ముందు కూడా కొన్ని చనిపోయాయి. దీనిపై అనుమానం వచ్చిన మెహిదీజంగ్ కాలనీకి చెందిన పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ ప్రతినిధి ప్రతా్పకుమార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. చనిపోయిన శునకానికి పశువైద్యాధికారితో పోస్టుమార్టం చేయించామని, నమూనాలను ఎఫ్ఎ్సఎల్కు పంపామని ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm