హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ లేఖ రాశారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోడీ లేఖలో పేర్కొన్నారు. వైష్ణవ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వైద్య విద్య ద్వారా దేశసేవ చేయాల్సిన వైష్ణవ్ మృతి బాధాకరమని మోడీ వ్యాఖ్యానించారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం విదితమే.
Mon Jan 19, 2015 06:51 pm