ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల పాటు నిరాహారదీక్షకు దిగుతున్నారు. కాసేపట్లో ఆయన దీక్ష ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ముందు జనసేన పలు డిమాండ్లు ఉంచింది. ఆ డిమాడ్లు ఇవే...
*ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
* ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి ఒకసారి డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స అందించాలి.
* డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
* కిడ్నీ వ్యాధిగ్రస్తులను మందులను ఉచితంగా అందించాలి.
* డయాలసిస్ చేయించుకునేవారికి... అన్ని స్టేజుల్లో ఉన్నవారందరికీ పించన్లు అందించాలి.
* కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
* శుద్ధి చేసిన నీటిని ప్రతి గడపకూ అందించాలి.
* వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించేందుకు పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.
* ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీని కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలి.
* ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
* రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే నియమించాలి.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా జనసేన ఓ సూచన చేసింది. ఉద్దానం సమస్య తమ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం తప్పించుకోరాదని... రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సమన్వయం చేసుకుంటూ తగిన సహాయసహకారాలను అందించాలని కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 03:06PM