న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా విజయం తమదేనన్నారు. గత ఎన్నికల్లో గెలవలేకపోయిన 80 కొత్త స్థానాల్లో నెగ్గుతామని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిస్తే తమకు సవాలేనని అయితే దీనికి తగ్గట్లుగానే వ్యూహాలు రూపొందిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో రాయ్బరేలీ, అమేథీల్లో ఒక స్థానాన్ని తప్పకుండా గెలుచుకుంటామని చెప్పారు. అటు మహారాష్ట్రలో శివసేన కలిసి వస్తే సంతోషమేనని, రాకపోయినా ఇబ్బంది ఉండదన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులను మార్చబోమని తెలిపారు. రాజస్థాన్ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఈ నెల 26 తర్వాత తేలుస్తామని అమిత్ షా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 274 స్థానాలతో మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని ఏబీపీ సర్వే వెల్లడించిన నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది
Mon Jan 19, 2015 06:51 pm