హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న అపోహలు ఇతరత్రా విషయాలపై అవగాహన కల్పించేందుకు నగరంలోని పలు మురికివాడల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ మెడికల్ అంకాలజిస్టు డాక్టర్ వేణుగోపాల్ ఆర్రోజు వెల్లడించారు. శుక్రవారం హైదర్గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఈ వ్యాధి సంక్రమించే లక్షణాలు, ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది... నిర్ధారణలో వాడే పరీక్షలు ఏమిటి, చికిత్సలో వాడే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్రా అంశాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కిమోథెరఫీ, రేడియేషన సర్జరీ ఆధునాతన పద్ధతులు వచ్చిన తర్వాత క్యాన్సర్ వ్యాధిని ప్రస్తుతం పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. తాము తరచూ నగరంలోని పలు మురికివాడల ప్రాంతాలలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm