బెంగళూరు: రంజాన్ పండుగను పురస్కరించుకుని వొడాఫోన్ ఇండియా తన ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద 90రోజులపాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ కాల్స్, 1.4జిబి డేటా లభిస్తాయని సంస్థ బిజినెస్ హెడ్ అమిత్కపూర్ నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ కోసం రూ.509 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇవి కాక మరో రెండు ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm