హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఓ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలివేలు అనే మహిళను డీఎస్పీ మాధవరెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారం పట్ల ఆమె కుమారుడు సాగర్ కలత చెందాడు. తన తల్లిని మీడియా ముందు ప్రవేశపెట్టడం సరికాదంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... నిందితులను, అనుమానితులను మీడియాకు చూపే హక్కు పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది. ఏ అధికారంతో నిందితురాలిని మీడియా ముందు ప్రవేశపెట్టారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm