న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సరితా విహార్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో స్థానికులు ఓ బ్యాగ్ను గుర్తించారు. ఆ బ్యాగును తెరిచి చూస్తే ముక్కలు చేసి ఉన్న మహిళ మృతదేహం దానిలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..చేతులు, అవయవాలు ముక్కలుగా చేయబడ్డ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు గుర్తు పట్టకుండా ఉందని, ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm