హైదరాబాద్ : చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కెమెరా రిపేరింగ్ చేస్తున్న ఆకాష్ అనే వ్యక్తిపై కత్తితో దుండగులు దాడి చేసి పరారయ్యారు. దుండగుల దాడిలో గాయాలపాలైన బాధితుడు ఆకాష్.. తనకు తానుగా హాస్పిటల్కు వెళ్లినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తున్న దృశ్యం రికార్డు అయింది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm