విజయవాడ: నగరంలోని టీచర్స్ కాలనీలోని సిల్వర్స్పూన్ హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు కస్టమర్లు ఆస్పత్రిపాలయ్యారు. శుక్రవారం ఈ హోటల్లో బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.
బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు.
అమరావతి ప్రాంతం రాజధాని కావడంతో ఇక్కడ అనేక హోటళ్లు వెలుస్తున్నాయి. కష్టమర్లు కూడా భారీగా ఉంటున్నారు. అయితే, హోటళ్ల యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కష్టమర్ల ఆరోగ్యంతో చెలగాటాలాడుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 08:17PM