హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమం శనివారం జరుగనుంది. ఈ కార్యక్రమంలో 2014 - 2018 విద్యాసంవత్సరంలో బీటెక్ పూర్తి చేసిన వారికి పట్టాలతో పాటు ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేస్తారు. టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్. శ్యాంసుందర్ అధ్యక్షత వహించనుండగా ముఖ్య అతిథిగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, గౌరవ అతిథిగా కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మెన్, ఓఎన్జీసీ జీఎం సుల్గయ్ సత్యపాల్ హాజరుకానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm