అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి ఆటో రాంగ్రూట్లో రావడమే కారణమని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు... ఎదురుగా రాంగ్ రూట్లో వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్ర బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ను అక్కడకు పంపి సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని ఆదేశించినట్లు ఎండీ తెలిపారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm