గుంటూరు: నగరంలోని ఓ ప్రాంతంలో కుళ్లిపోయిన, బూజుపట్టిన మాంసం నిల్వలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరెడ్డితోపాటు పలువురు అధికారులు ఆదివారం గోరంట్ల రోడ్డులోని అరబిక్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుళ్ళిపోయిన, బూజుపట్టిన మాంసం నిల్వలను గుర్తించారు. అనంతరం రామన్నపేటలోని శంకర్ చికెన్ స్టాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే... చికెన్ స్టాల్ మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కాగా... చికెన్ షాపు నిర్వాహకులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. ఎవరూ ఫిర్యాదు చేస్తే వచ్చారంటూ దురసుగా ప్రవర్తించడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm