న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం జరిగిన హత్య కేసులో నిందితుడిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది సతీమణి శైలజ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హత్యకు గురయ్యారు. ఆమె గొంతు కోసి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని గమనించినవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను మొదట హత్య చేసి, ఆ తర్వాత ఆమె మృతదేహంపై నుంచి వాహనాన్ని నడిపినట్లు అనుమానించారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఫిజియోథెరపీ కోసం ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె మృతదేహం కనిపించింది. శైలజతో ఆసుపత్రిలో చివరిసారి నిఖిల్ హండా కనిపించారు. హండాను ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో అరెస్టు చేశారు. మేజర్ హండా ప్రస్తుతం దిమాపూర్లో పని చేస్తున్నారు.
శైలజ భర్త అమిత్ ద్వివేది శనివారం సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. తన భార్య అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. అప్పుడు గుర్తు తెలియని మృతదేహం వివరాలను పోలీసులు ఆయనకు తెలిపారు. హతురాలు తన భార్యేనని ఆయన గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 24,2018 03:54PM