హైదరాబాద్: సినీనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తన జీవితానికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన రేణూ.. తాజాగా ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇవ్వకపోయినా.. ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్తో వెల్లడించేశారు.
'జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఓ తోడు అవసరం్ణ అని పేర్కొన్న రేణూ దేశాయ్.. ఇటీవల తన రెండో వివాహ ఆలోచనలను షేర్ చేసుకున్నారు. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫొటోను ఓ కవితతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేశారు. కాగా, విడాకుల అనంతరం పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకోగా, రేణు మాత్రం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా అకీరా తండ్రి పవన్తో కలిసి విజయవాడలో ఉంటున్నాడని ఇటీవల రేణు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 24,2018 05:30PM