హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అడుగు జాడల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనను అంతం చేసేందుకే బీజేపీ జన చైతన్యయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ల్యాండ్, శాండ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. మద్యంపై ఆదాయం కోసం ప్రజలను తాగుడుకు బానిసలను చేస్తున్నారని, కారు స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని ఎద్దేవాచేశారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీ వేదికగా మారిందని, కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ లక్ష్మణ్ సవాల్ విసిరారు.
Mon Jan 19, 2015 06:51 pm