హైదరాబాద్: దానం నాగేందర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పదవుల కోసమే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్పై దానం చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానిదే అధిపత్యం నడుస్తోందని, ముఠా రాజకీయాలు ఎక్కువైపోయాయని దానం నాగేందర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే పార్టీలో ఎన్నో జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఈ కారణంగానే పార్టీని వీడుతున్నానని దానం స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టి.కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నాగేందర్ రెండు సంవత్సరాలు కాంగ్రెస్లో టైంపాస్ చేశారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ను విమర్శిస్తే.. కన్న తల్లిని విమర్శించినట్లేనన్నారు. దానం కాంగ్రెస్లో పులిగా ఉన్న వ్యక్తి... టీఆర్ఎస్లో పిల్లి అవుతారని వ్యాఖ్యానించారు. దానం పరిస్థితి సముద్రం నుంచి బావిలో పడ్డట్లైందన్నారు. కాంగ్రెస్ను తిట్టడం మానుకోవాలని హితవుచెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 24,2018 07:43PM